EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏమిటి ఈ FCRA బిల్లు?

    Author SHANKARAVAM NEWS | 08 Aug 2026, 01:04 PM | ANDHRA PRADESH, NATIONAL, Politics, TELANGANA
    ఏమిటి ఈ FCRA బిల్లు?

    ఏమిటి ఈ FCRA బిల్లు?
    FCRA అంటే Foreign Countribution Regulatory Act.
    అదే తెలుగు లో అయితే విదేశీ నిధుల సవరణ చట్టం అన్న మాట.
    ఈ చట్టం ఎప్పటి నుంచో మన దేశంలో ఉంది.
    అయితే ఈ చట్టం రకరకాల కారణాల వల్ల దుర్వినియోగం అవుతున్నందున ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఒక కొత్త సవరణ బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తూంది భారత ప్రభుత్వం.
    ఈ బిల్లు ద్వారా చాలా ఏళ్ళుగా దేశం లోని చాలా NGO లు అనగా స్వచ్చంద సంస్థలు విదేశీ నిధులు పొందుతూ కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    అందులో చాలా సంస్థలు మతం మార్పిడులు కూడా చేస్తున్నారు.
    ఆ తర్వాత దేశం లో పెద్ద పెద్ద చర్చిల నిర్మాణం చేస్తున్నారు.
    ఇంకా అనేక రకాల దేశ వ్యతిరేక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు.
    ఒక్క క్రైస్తవ NGO లే కాకుండా ఇతర NGO లు కూడా ఇలాంటి సేవ ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
    ఈ NGO లలో కొన్ని మంచివి కూడా ఉన్నాయి.
    ఇవి వృద్ధాశ్రమాలు., దివ్యాంగ సంస్థలు., పర్యావరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    వీటితో దేశానికి ఎలాంటి ప్రమాదం లేదు.
    విదేశీ నిధులు పొందుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న NGO ల వల్ల నే ప్రమాదం.
    కాబట్టి ఈ విదేశీ నిధుల సవరణ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది భారత ప్రభుత్వం.
    ప్రవేశ పెట్టిన మరు క్షణమే దేశంలోని క్రైస్తవ మత సంఘాల పెద్దలు పాస్టర్లు బిషప్ లు ఈ చట్టం క్రైస్తవులకు వ్యతిరేకం దీన్ని ఆపాలి లేదా తమకు అనుకూలంగా కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత హోం శాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి తమ డిమాండ్ లను వారి ముందుంచింది.
    ఇదిలా ఉండగా అమెరికా కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది.!?
    ఇది మన దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అవుతుంది.
    ఎందుకంటే?
    అన్ని దేశాల్లో ఈ చట్టం ఉంటుంది!
    అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలేమూర్ ఒక అడుగు ముందుకు వేసి ఇది ఈ చట్టం క్రైస్తవులపై దాడి అని వ్యాఖ్యానించారు!?
    ఇది మరీ విడ్డూరం.
    అయితే దీనిని మన విదేశాంగ ప్రతినిధి శ్రీ రణధీర్ గారు తీవ్రంగా ఖండిస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
    ఇది తమ దేశ అంతర్గత వ్యవహారాలలో నేరుగా తలదూర్చడమే అవుతుందని అన్నారు.
    ఈ నేపథ్యంలో మతం మార్పిడుల వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
    ఒకవేళ ఈ చట్టం అమలులోకి వస్తే తమ కార్యకలాపాలు దాదాపు మూత పడటం ఖాయం అని తెలుసుకొని క్రైస్తవ తదితర సంస్థలు దేశం లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
    భారత్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో అమెరికా కాస్త తలొగ్గి తమ నిధులు నేరుగా NGO లకు కాకుండా భారత ప్రభుత్వానికే పంపడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
    ఇక ఈ NGO లు ప్రతీ సంవత్సరం కూడా తమకు ఎన్ని విదేశీ నిధులు వచ్చాయి? వాటిని దేనికోసం వినియోగించారు? తదితర వివరాలతో ఆడిట్ చేయించాలి.
    ఇదీ అసలు విషయం.
    ఈ చట్టం అమలైతే తమ కుట్రల బండారం బట్టబయలు అవుతుందని కొన్ని NGO లు గగ్గోలు పెడుతున్నాయి.
    ఉదాహరణకు షబానా ఆజ్మీ అనే సినీనటి కూడా ఒక NGO నడుపుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నది.
    ఈవిడే మొన్నీమధ్య జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ ల ఆందోళనలో కూడా పాల్గొంది.
    ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
    ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.
    కావున దేశ ప్రజలు ఈ చట్టం గురించి పూర్తి అవగాహనకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
    ఈ చట్టానికి పూర్తి మద్దతు తెలపాల్సిన అవసరమెంతో ఉంది.
    ఏది ఏమైనా మతం మార్పిడులు దేశానికి చాలా ప్రమాదమని అవి దేశ విచ్చిన్నానికి దారి తీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది .