EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాపై నిఘా పెట్టారు.. సీఎం సోదరుడిపై ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు

    Author ARYADVI NEWS | 24 Aug 2026, 07:12 PM | TELANGANA
    నాపై నిఘా పెట్టారు.. సీఎం సోదరుడిపై ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు

    నిజామాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోమవారం తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు, ఒక ఏసీపీ స్థాయి అధికారి తన కదలికలపై నిఘా ఉంచినట్లు ఆయన ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ చేశారు."డీజీపీ సీవీ ఆనంద్ గారూ, మీరు నాకు దశాబ్దాలుగా తెలుసు. మిమ్మల్ని ఎప్పుడూ ఒక సమర్థవంతమైన అధికారిగానే పరిగణించాను. అయితే, ముఖ్యమంత్రి సోదరుడి ఆదేశాల మేరకు ఒక ఏసీపీ స్థాయి అధికారికి నా కదలికలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించినట్లు నా దృష్టికి వచ్చింది" అని అర్వింద్ తన పోస్టులో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన పోలీసుల పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తెలంగాణ పోలీసులు రాజ్యాంగానికి, చట్టబద్ధమైన అధికార యంత్రాంగానికి లోబడి పనిచేస్తారా? లేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు నడుచుకుంటారా? అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రాథమిక ప్రశ్న" అని ఆయన నిలదీశారు. పోలీసులు కేవలం చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని, ఏ రాజకీయ కుటుంబానికీ కాదని తాను ఆశిస్తున్నట్లు అర్వింద్ స్పష్టం చేశారు.